A.P-T.G

ఎం.పీలుగా నూతన ప్రజాస్వామ్యదేవాలయంలోకి ప్రవేశించడం మా అదృష్టం-మాగుంట

అమరావతి: లోకసభలో వాజీపేయ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నప్పుడు,1 ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో,వాజీపేయ్ ప్రభుత్వం కూలిపోయిందని ఒంగోలు ఎం.పీ మాగుంట.శ్రీనివాసులరెడ్డి నాడు సభ జరిగిన తీరు గురించి ప్రస్తవించారు.సోమవారం ప్రారంభంమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో అయన మాట్లడుతూ తొలుత జీ20 సదస్సును దిగ్విజయం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీకి అయన సహచరులకు అభినందనలు తెలిపారు.అనంతరం అయన మాట్లాడుతూ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల తరపును 543 మంది ఎం.పీలుగా ప్రజాస్వామ్యదేవాలయం అయిన పార్లమెంట్ లో ప్రవేశించడం తమ అదృష్టమన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా నిర్వహించుకుంటున్న సమావేశాల్లో పాల్గొనడం మరుపురాని సందర్బం అన్నారు..దేశం సాంకేతికంగా,,డిజీటల్ పరంగా అభివృద్ది పథంలో ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తీరు ప్రసంశనీయమన్నారు.

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *