A.P-T.GNATIONAL

రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం-మోదీ

అమరావతి: ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ చిహ్నమని,,75 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు..చారిత్రక విజయాలు ఎన్నో ఇక్కడి తీసుకున్నమని,,వాటిని మనం గుర్తుంచుకోవాలని అన్నారు..మంగళవారం నుంచి మనం కొత్త భవనంలోకి వెళ్తన్నప్పటికీ పాత భవనం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు..ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు చెబుతున్నామని,,ఈ భవనాన్ని వదిలిపెట్టడం అంత తేలికైన విషయం కాదన్నారు..కుటుంబం తన ఇంటిని వదిలివెళ్లేటప్పుడు ఎన్నో అనుభూతులు వెంటాడుతాయని,,అలాగే ఈ పార్లమెంట్ భవనాన్ని వదలివెళ్తున్నప్పుడు కూడా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తాయని చెప్పారు..భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలని,,అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు..ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.

Power Of News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *